న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల పొయ్యి వైపు మళ్లారు. ఏడాదికి ఒక్కసారిగా కూడా సిలిండర్ను రీఫిల్ చేసుకోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఎల్పీజీ లబ్ధిదారుల సంఖ్య అయితే కోటి కుటుంబాలకు పైనే ఉన్నది. కాగా, ఉజ్వల పథకం కింద మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది.
కొత్త కనెక్షన్లకు గానూ రూ.1,650 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.59 కోట్ల మంది పీఎంయూవై లబ్ధిదారులకు గానూ 1.18 కోట్ల మంది(12 శాతం) కనీసం ఒక్కసారి కూడా తమ సిలిండర్ను రీఫిల్ చేయించుకోలేదని కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. మరికొంత మంది లబ్ధిదారులు ఒకటి లేదా రెండుసార్లు రీఫిల్లింగ్కే పరిమితం అయ్యారు. కాగా, గత నెల వరకు 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ రూ.1,150కు పైగా పలుకగా.. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఇటీవల గ్యాస్ ధరలను రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
మూడో దశ ఈ-కోర్ట్ ప్రాజెక్టుకు ఆమోదంమూడో దశ ఈ-కోర్ట్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు రూ.7,210 కోట్లు ఖర్చవుతుంది.