ధరలు భరించలేక ఖాళీ బుడ్డిలు మూలకు
ఒక్కసారి కూడా రీఫిల్ చేయించుకోని
90 లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులు
దేశంలో 8.99 కోట్ల ఉజ్వల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. 2021-22లో 90 లక్షల మంది లబ్ధిదారులు ఒక్కసారి కూడా రీఫిల్ చేయించుకోలేదు. 1.08 కోట్ల మంది ఒక్కసారి మాత్రమే రీఫిల్ చేయించారు.
భోపాల్, మే 1: మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్ నిం పించుకొంటే మేం ఏం తినాలి.. దానిపై వంట చేసుకోవడానికి ఏమైనా కొనాలన్నా కూడా నా దగ్గర డబ్బు మిగలదు’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది కనీసం ఒక్కసారి కూడా తమ సిలిండర్ను మళ్లీ నింపించుకోలేదు. మరో కోటి మంది కేవలం ఒకేసారి సిలిండర్ రీఫిల్ చేసుకొన్నారు. గ్యాస్ ధరలు సామాన్యులపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఈ అంకెలను బట్టి అర్థం చేసుకోవచ్చు.