ముంబై : తనపై కోపంతో ముంబైకి ద్రోహం చేయవద్దని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సీఎం ఏక్నాథ్ షిండేను కోరారు. మెట్రో రైల్ షెడ్ ప్రాజెక్టును యారే కాలనీకి తరలిస్తూ షిండే తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. యారే కాలనీకి కార్ షెడ్ తరలింపుతో పర్యావరణ కాలుష్యం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తనను వెన్నుపోటు పొడిచినా ముంబైని మాత్రం వెన్నుపోటు పొడవకండి అని హితవు పలికారు. ప్రజల కన్నీళ్లే తన బలమని చెప్పారు. బీజేపీతో వెళ్లిన సేన ఎమ్మెల్యేలు తమను తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. 2019లో తమతో అధికారాన్ని పంచుకునేందుకు నిరాకరించిన కాషాయ పార్టీ ఏక్నాథ్ షిండేతో ఇప్పుడు చేతులు ఎలా కలిపిందని ఠాక్రే ప్రశ్నించారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకరాం చేసిన షిండే, ఫడ్నవీస్కు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని రౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు.