ముంబై/న్యూఢిల్లీ, మార్చి 25: మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. తన భార్య సోదరుడు శ్రీధర్ మాధవ్కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై శుక్రవారం ఆయన అసెంబ్లీ వేదికగా స్పందించారు. అధికారం కోసం బీజేపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నదని మండిప డ్డారు. చేశారు. ‘మీరు అధికారంలోకి వచ్చేందు కు మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటే.. ముందు ‘నన్ను జైల్లో పెట్టండి’ అని సవాల్ విసిరారు.
దర్యాప్తు సంస్థలు ఇన్నేండ్లు ఏం చేస్తున్నట్టు?
మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్తో సంబంధాలు ఉంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్నేండ్లుగా ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. దావూద్ ఇబ్రహీంతో మాలిక్ డీల్కు సంబంధించిన వివరాలు ఈడీకి ఇచ్చానని చెబుతున్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ను కేంద్రం సీబీఐ లేదా ‘రా’ సంస్థల్లో చేర్చుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రామమందిరం పేరుతో ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు దావూద్ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నదని పేర్కొన్నారు. ‘లాడెన్ను చంపించినట్టు దావూద్ ఎక్కడున్నాడో గుర్తించి హతమార్చే దమ్ము, ధైర్యం ఉందా?’ అన్నారు.
శివసేన ఎమ్మెల్యే ఆస్తులు అటాచ్
శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్కి చెందిన రూ.11.35 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్సేంజీ లిమిటెడ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వీటిని సీజ్ చేసినట్టు తెలిపింది.