శ్రీనగర్, ఫిబ్రవరి 4: జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం మట్టుబెట్టాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో ఆపరేషన్ క్లిష్టంగా మారింది. 20 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.