న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు నూతనంగా నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరితో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్తో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయికి(మంజూరు బలం-34) చేరింది.