పట్నా : బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఇద్దరు దుండగులు ఏకంగా బ్యాంకు ఏటీఎం సెక్యూరిటీ వాహనంలో నగదును దోపిడీ చేసేందుకు యత్నించారు. పట్టణంలోని పురైని బజార్లోని సెంట్రల్ బ్యాంక్ గేటు ఎదుట బ్యాంకుకు చెందిన సెక్యూరిటీ వాహనాన్ని సిబ్బంది పార్క్ చేశారు. వాహనం వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీతో సెక్యూరిటీ గార్డులను బెదిరించి వ్యాన్లోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు.
వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ దుండగునిపైకి కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు బైక్పై పరారయ్యేందుకు యత్నిస్తూ అదుపుతప్పి పడిపోయారు. సమీపంలోని సీసీకెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.