హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్డ్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ సాయంతో పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. జేఎన్టీయూ పరిధిలోని బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బీటెక్లో మూడు సబ్జెక్టులు, ఫార్మసీలో 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉండటంతో వీలైనంత త్వరగా వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రక్రియ ఇలా..