Patna Court Blast | బిహార్ పాట్నా సివిల్ కోర్టు కాంప్లెక్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో న్యాయవాదితో పాటు మరో దుకాణదారుడు ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
కోర్టు వద్ద ఒక్కసారిగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫర్మర్ పేలుడు సంభవించి.. భారీగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్లోని గేట్ నంబర్ వన్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పేలుడు సంభవించింది. ప్రమాదంపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయవాదులను శాంతింప జేశారు. ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తున్నది.