న్యూఢిల్లీ, మే 2: ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది. శనివారం ఆయన ఢిల్లీలోని అధికారిక నివాసం వెనుక నుంచి కారులో వెళ్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో..ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచాఫ్లో ఉందని, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పాఠక్ రహస్య ప్రదేశంలో తలదాచుకున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.