ముంబై : ఉత్తరప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదు వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణే నగరంలో పుణ్యేశ్వర్ ఆలయ భూముల్లో దర్గాలను నిర్మించారని రాజ్థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పేర్కొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ షిండే మాట్లాడుతూ పుణ్యేశ్వర ముక్తి (ఆలయ భూమి విముక్తి) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆలయ భూమిని పునరుద్ధరించడంలో రాజ్ థాకరే నేతృత్వంలోని పార్టీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి లాగే పుణేలోని పుణ్యేశ్వరాలయం కోసం కూడా పోరాడుతున్నామన్నారు. ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ పుణేలోని పుణ్యేశ్వర్, నారాయణేశ్వర్ ఆలయాలను కూల్చివేశాడని, ఆ తర్వాత ఆ భూమిలో దర్గాలు నిర్మించారని షిండే పేర్కొన్నారు.