Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు భోపాల్లోని ఎయిమ్స్లో ఢిల్లీకి చెందిన నలుగురు వైద్యులు త్విషా మృతదేహానికి రెండోసారి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం ఆమె మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం త్విషా శర్మ అత్తగారిల్లు అయిన భోపాల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మోడల్, నటి అయిన త్విషా శర్మ ఈ నెల 12న భోపాల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంటిపై ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆమె భర్త గత శుక్రవారం లొంగిపోయాడు. కోర్టు అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
త్విషా శర్మ అంత్యక్రియల సందర్భంగా అక్కడ విషాధ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు, యువత, మహిళలు అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్నారు. త్విషా శర్మ ఆత్మశాంతికి అందరూ ప్రార్థించాలని ఆమె తండ్రి కోరారు. త్విష మృతి ఘటనలో న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరారు.