TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. మొత్తం 2.25 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
రోజుకు 2 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. నిర్ణయించింది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచనుంది. ఇక డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠద్వార దర్శన టికెట్లను విడుదల చేయనుంది.