జమ్మూ: జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించనున్నది. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూలో వేద పాఠశాల, ఆధ్మాత్మిక-ధ్యాన కేంద్రం, రెసిడెన్షియల్ క్వార్టర్స్, వైద్య-విద్యా కేంద్రాలను కూడా నిర్మించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన కశ్మీర్లో ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని ఆశిస్తున్నారు. జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణవోదేవి, అమర్నాథ్ ఆలయాలకు వేల సంఖ్యలో ప్రతి ఏడాది భక్తులు వస్తుంటారు. ఇక టీటీడీ ఆలయ నిర్మాణంతో టూరిజం ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.