న్యూఢిల్లీ : తెలంగాణ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్పై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా సాయం చేయలేదు అని మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ భగీరథను దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. రాష్ట్రం పండించిన ధాన్యం కొనుగోలు చేయడం కూడా కేంద్రానికి చేత కాలేదు. ఎంఎస్పీ చట్టానికి కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.
ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర బడ్జెట్లో కేటాయించింది నామమాత్రమే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు కేటాయించినంత కూడా కేంద్రం ఇవ్వలేదు. గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తున్నాం. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి అని ఎంపీ వెంకటేశ్ నేత ధ్వజమెత్తారు.