భువనేశ్వర్: ఒడిశాలో మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొని 291 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగుతున్నది. సంబంధిత రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ఎవరు బాధ్యులనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నది.
ప్రమాదానికి బాధ్యులుగా గుర్తించిన ముగ్గురు రైల్వే అధికారులను శుక్రవారం సాయంత్రం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పూకుమార్ ఉన్నారు. ఇండియన్ పీనల్ కోడ్లోని 304, 201 సెక్షన్ల ప్రకారం నిందితులను అరెస్ట్ చేసినట్లు సీబీఐ తెలిపింది. వారి నిర్లక్ష్యపు చర్యలే రైలు ప్రమాదానికి కారణమయ్యాయని పేర్కొంది.