ముంబై: కువైటీ పడవలో ప్రయాణించి, చట్టవిరుద్ధంగా భారత దేశంలో ప్రవేశించిన ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిట్సో డిట్టో (31), విజయ్ వినయ్ ఆంథోనీ (29), జే సహయట్ట అనిష్ (29)లను ఈ నెల 10 వరకు పోలీసు రిమాండ్కు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
అయితే వీరి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సునీల్ పాండే మాట్లాడుతూ, కువైట్లో వీరు పని చేస్తున్న సంస్థ యజమాని వీరి పాస్పోర్టులను లాక్కున్నారని చెప్పారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీరు అమాయకంగా పడవలో ప్రయాణించారని తెలిపారు. తమ స్వరాష్ట్రం తమిళనాడుకు వెళ్లిపోవాలని వీరు భావించారని చెప్పారు.