నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్టీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి అఖిల్ గిరి క్షమాపణలు చెప్పారు. 17 సెకండ్లు ఉన్న ఓ వీడియో క్లిప్లో రాష్ట్రపతి ముర్ము గురించి మంత్రి గిరి అనుచిత కామెంట్ చేశారు.
బీజేపీ వాళ్లకు తాను మంచి కనిపించడం లేదంటూ.. రూపం ద్వారా ఎవర్నీ అంచనా వేయలేమని, భారత రాష్ట్రపతిని గౌరవిస్తామని, కానీ ఆ రాష్ట్రపతి రూపం ఎలా ఉందంటూ మంత్రి గిరి వ్యాఖ్యలు చేశారు. నందీగ్రామ్లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ప్రెసిడెంట్ అని అన్నాను, కానీ ఎవరి పేరును ఎత్తలేదని, ఒకవేళ భారత రాష్ట్రపతి తన వ్యాఖ్యల పట్ల అవమానంగా ఫీలయితే, దానికి తాను సారీ చెబుతున్నాని మంత్రి అఖిల్ గిరి అన్నారు.
Statement:
This is an irresponsible comment & does NOT represent the views of @AITCofficial.
We are extremely proud of the President of India & hold her & her office in the highest regard. https://t.co/v571435Snv
— Saket Gokhale (@SaketGokhale) November 12, 2022
మంత్రి గిరి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు తృణమూల్ పార్టీ పేర్కొన్నది. మంత్రి వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఖండించింది. మంత్రి వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు. రాష్ట్రపతి ముర్ము పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రపతి ముర్ముపై చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. క్యాబినెట్ నుంచి ఆ మంత్రిని తొలగించాలని సీఎం మమతా బెనర్జీని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ అంశంపై దీదీ వివరణ ఇవ్వాలన్నారు. బెంగాల్ సీఎం ఓ మహిళ అని, ఆమె క్యాబినెట్లో ఉన్న ఓ మంత్రి.. గిరిజన రాష్ట్రపతిపై కామెంట్ చేశారని, ఇది మన అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీస్తుందని, బెంగాల్ ప్రభుత్వం ఆదివాసీలను వేధిస్తున్నట్లు స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు.