న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) పార్టీ అన్ని సీట్లలో పోటీ చేసేందుకు రెఢీగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 42 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ అంశంపై క్లారిటీ దొరకడం లేదు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 42 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సుముఖం ఉందని ఒబ్రెయిన్ చెప్పారు. అస్సాంలో కొన్ని సీట్లు, మేఘాలయాలోనూ పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఒబ్రెయిన్ ఇటీవల చెప్పారు. అయితే తుదికు ఎటువంటి మార్పు ఉంటుందో అంచనా వేయడం కష్టంగానే ఉన్నది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇటీవల యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై ఓ ప్రకటన చేసింది. యూపీలో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీచేయనున్నది. ఇక ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీతో కలిసి పనిచేయనున్నది.