నూతనంగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంతో తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. మమత నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి- ఒకే పోస్ట్ అన్న నినాదాన్ని అభిషేక్ బలంగా తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలోనే సీఎం మమత కొన్ని రోజుల క్రితం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే జాతీయ కార్యవర్గం ప్రకటించారు. ఆఫీస్ బేరర్ల నియామకం, వారికి ఇచ్చే హోదాలతో పాటు మమతా బెనర్జీకి ఇచ్చే పోస్ట్పై కూడా ఈ సమావేశం చర్చించనుంది. అయితే అభిషేక్ బెనర్జీకి తిరిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా దక్కుతుందా? అన్నది ఆసక్తికర పరిణామం.