TMC Mega Rally : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించనుంది. కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మెగా ర్యాలీ వేదికగా ప్రచార శంఖారావాన్ని పూరించనున్న టీఎంసీ అదే వేదికగా 42 లోక్సభ స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
జన గర్జన సభ పేరుతో నిర్వహించనున్న ఈ ర్యాలీకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని టీఎంసీ సమీకరించనుంది. కేంద్ర ప్రభుత్వం బెంగాల్కు బకాయిలు విడుదల చేయడంలో నిర్లక్ష్యాన్ని సభా వేదికగా మమతా బెనర్జీ ఎండగట్టనున్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో సుదీర్ఘ విరామం అనంతరం తాము ర్యాలీ నిర్వహిస్తున్నామని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ ర్యాలీ చారిత్రాత్మకంగా నిలవనుందని, ఈ సభలో మమతా బెనర్జీ సందేశాన్ని రాష్ట్రం నలుమూలలకూ తీసుకువెళతామని టీఎంసీ నేత ఫర్హాద్ హకీం వెల్లడించారు.
రాష్ట్రంలో 42 లోక్సభ స్ధానాల్లో బీజేపీని మట్టికరిపిస్తామని స్పష్టం చేశారు. టీఎంసీ మెగా ర్యాలీకి దీటుగా అదే రోజు బీజేపీ భారీ కార్యక్రమం చేపడుతోంది. టీఎంసీ నేత షాజహాన్ షేక్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపధ్యంలో సందేశ్ఖాలిలో నిరసన ర్యాలీకి కాషాయ పార్టీ సన్నద్ధమైంది. కోల్కతా బ్రిగేడ్ పరేడ్లో టీఎంసీ ర్యాలీని ఆ పార్టీ వీడ్కోలు ర్యాలీగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు.
Read More :
Hyderabad | చిల్ అయిపోదాం.. ఫామ్ హౌస్ల వైపు యువత చూపు!