కోల్కతా : పశ్చిమ బెంగాల్లో దారుణ ఉదంతం వెలుగుచూసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత (TMC Leader Shot Dead) సత్యన్ చౌధురిని ఆదివారం బైక్పై వచ్చిన దుండగులు కాల్చిచంపారు. ముర్షిదాబాద్కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యన్ చౌధురిపై బెంగాల్లోని బహరంపూర్లో జరిగిన దాడి కలకలం రేపింది.
చౌధురిపై దుండగులు కాల్పులు జరపడంతో స్ధానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. బైక్లపై వచ్చిన కొందరు వ్యక్తులు చౌధురిని చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారని స్ధానిక టీఎంసీ నేత తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురితో సన్నిహితంగా మెలిగిన చౌధురి ఆపై పాలక టీఎంసీలో చేరారు.
Read More :
Migratory birds | త్రివేణి సంగమంలో సైబీరియన్ వలస పక్షుల సందడి.. Video