కోల్కతా, జూన్ 22: తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నాయకత్వాన్ని సవాలు చేస్తున్న తిరుగుబాటు వర్గం పార్టీ చైర్పర్సన్ మమత స్థానంలో సీనియర్MLA Arup Royను సోమవారం నియమించింది. తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ ఈ నియామకాన్ని ప్రకటించారు. తమదే నిజమైన తృణమూల్ కాంగ్రెస్గా అభివర్ణించుకుంటున్న తిరుగుబాటు వర్గం సమాంతర వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తూ పార్ట్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు శాసనసభ, పార్లమెంటరీ విభాగాలకే పరిమితమైన తిరుగుబాటు ఇప్పుడు పార్టీ నిర్మాణంలోకి సైతం చొరబడింది. ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ కౌన్సిలర్లతో సమావేశమైన తర్వాత అరూప్ రాయ్ను పార్టీ చైర్పర్సన్గా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో అరూప్ రాయ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో తలెత్తిన రాజ్యాంగపర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తిరుగుబాటు వర్గం తెలిపింది. ప్రతి మూడేండ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నియమావళి నిర్దేశిస్తున్నదని, అయితే 2022 ఫిబ్రవరిలో ఏర్పాటైన గత కమిటీ పునర్వ్యవస్థీకరణ జరగకుండానే తన పదవీకాలాన్ని పూర్తి చేసిందని రితబ్రత తెలిపారు.