రాంచీ, డిసెంబర్ 18:జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో శ్రద్ధ వాల్కర్ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడు. 12 భాగాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. రుబికా పహాదిన్ (23)తో దిల్దార్ అన్సారీ రెండేండ్లు సహజీవనం చేసి ఇటీవల వివాహం చేసుకున్నాడు. హత్య తర్వాత అన్సారీ పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. శనివారం నిర్మాణంలో ఉన్న భవనం వద్ద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.