బేతుల్, డిసెంబర్ 7: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గిరిజన హాస్టల్లో ఉంటున్నది. అయితే రూ.400 దొంగలించినట్టు ఆ బాలికపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన హాస్టల్ సూపరింటెండెంట్ బాలిక మెడలో చెప్పుల దండ వేసి హాస్టల్ క్యాంపస్లో ఊరేగించారు. ఈ విషయం బాలిక తండ్రికి తెలియడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.