Train | ఏసీ కోచ్ ( AC Coach)లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ (air-conditioning unit ) నుంచి పొగలు రావడంతో సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ (Secunderabad-Agartala Express) రైలును ఒడిశా (Odisha) లోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ (Brahmapur railway station)లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రైలులోని బీ-5 కోచ్లో పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అలారం మోగించారు. దీంతో రైలు ఆగడంతో అందులోని ప్రయాణికులు (Passengers) భయంతో కిందకు దిగిపోయారు. సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని పొగను అదుపు చేశారు.
అయితే, మళ్లీ విద్యుత్ కారణంగా ప్రమాదం జరుగుతుందన్న భయంతో ప్రయాణికులెవరూ ఆ కోచ్లో ఎక్కేందుకు నిరాకరించినట్లు ఓ అధికారి తెలిపారు. ‘బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలులో విద్యుత్ సమస్య తలెత్తింది. బీ-5 కోచ్లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుంచి పొగలు వెలువడ్డాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అలారం మోగించారు. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించారు’ అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. విద్యుత్ షాక్తోనే 40 మంది మృతి..!
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Odisha Train Accident | రైలు ప్రమాద వార్త నన్నెంతో కలచివేసింది : కింగ్ చార్లెస్