Covid-19: భారత్లో డెల్టా స్ట్రెయిన్ స్ధానంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం మొదలైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన క్రమంలో ప్రముఖ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం సార్స్-కోవ్-2ను మన జీవితాల్లో భాగంగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
కోవిడ్-19తో కలిసి జీవించడం మనం నేర్చుకోవాలని, ఈ వైరస్ వేరియంట్లు వ్యాప్తి చెందుతూనే ఉంటాయని..రాబోయే రోజుల్లో మరిన్ని వేవ్లు తలెత్తుతాయని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ ఒమిక్రాన్ తీవ్రత ఇతర వేరియంట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ఊరట ఇస్తున్నదని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ కేసుల్లో మూడింట ఒక వంతు కేసుల్లో స్వల్ప లక్షణాలు బయటపడుతుండగా మిగిలిన కేసుల్లో అసలు లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. పిల్లల్లో కొవిడ్-19 తీవ్రత తక్కువగా ఉందని, వీరిని స్కూల్స్కు పంపవచ్చని తాను భావిస్తున్నానని చెప్పారు. మరోవైపు భారత్లో ఇప్పటివరకూ 1270 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.