న్యూఢిల్లీ, జనవరి 31: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్కు సమర్పించనున్నారు. కాగా, 2022-23 బడ్జెట్లో కేంద్రం ఇచ్చిన హామీలు చాలా వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ గణాంకాలే బీజేపీ మోసపు హామీలను వెల్లడిస్తున్నాయి.
1. గత బడ్జెట్లో ఏం చెప్పారు?
2022-23 బడ్జెట్ సమయంలో 2023 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 9.2 శాతం ఉంటుందని వెల్లడించారు.
జరిగింది ఏమిటి?
వృద్ధి రేటు 2022-23లో 7 శాతమే ఉంటుందని కేంద్రం తాజా ఆర్థిక సర్వేలో తెలిపింది.
2. గత బడ్జెట్లో ఏం చెప్పారు?
గతఏడాది పీఎంఏవై స్కీమ్కు రూ.48 వేల కోట్లు కేటాయిస్తూ, 80 లక్షల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించింది.
జరిగింది ఏమిటి?
2022 ఏప్రిల్ 1 నుంచి 2023 జనవరి 23 వరకు పట్టణాల్లో 12 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 లక్షల ఇండ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి.
3.గత బడ్జెట్లో ఏం చెప్పారు?
2022-23లో 3.8 కోట్ల ఇండ్లకు కుళాయి నీటి కనెక్షన్లు ఇస్తామని మోదీ సర్కార్ ప్రకటించింది.
జరిగింది ఏమిటి?
ఇప్పటి వరకు కేవలం 1.7 కోట్ల ఇండ్లకే నీటి సరఫరా ఇచ్చారు.
4. గత బడ్జెట్లో ఏం చెప్పారు?
2022-23లో హైవేలను 25 వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తామని, 12 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకొన్నట్టు కేంద్రం పేర్కొన్నది.
జరిగింది ఏమిటి?
గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కొత్తగా కేవలం 5,774 కిలోమీటర్ల మేర మాత్రమే జాతీయ రహదారులు నిర్మించారు. ఇది పెట్టుకొన్న లక్ష్యంలో సగం కన్నా తక్కువ.