న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అద్భుతం. సాధారణంగా భూమిపై ఒకవైపు పగలు ఉంటే, మరోవైపు రాత్రి సమయం ఉంటుంది. కానీ, శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలో అత్యధిక భాగంపై ఒకేసారి సూర్యకాంతి ప్రసరించనున్నదని రెడ్డిట్లో గిడ్డీస్వైన్ అనే వ్యక్తి పోస్టు చేశారు. కొద్దిసేపట్లోనే ఈ పోస్టు వైరల్గా మారింది. 83 శాతం మందిపై సూర్యకాంతి స్పష్టంగా, 16 శాతం మందిపై తక్కువగా పడుతుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఆ సమయంలో చీకటి ఉంటుందని అంటున్నారు.