చెన్నై: తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థులు 90 శాతం మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సుమారు 5000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 500 మంది పాస్ కాగా 4500 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో తమ ఫలితాలపై ఆందోళన చెందిన విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్లో శనివారం నిరసనకు దిగారు. మెమోలో మార్కులను కూడా పేర్కొనలేదని ఆరోపించారు. పరీక్షల ఫలితాలను పునఃపరిశీలించాలని, తమకు న్యాయం చేయాలని అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు.