TMC : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను ఈసీ తొలగించడం పట్ల టీఎంసీ స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఈసీఐతో పాటు ఇతర సంస్ధలను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఈసీ వ్యవహరించేలా బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లోని చాలా సీట్లలో బీజేపీ ఓటమి పాలవుతుందని తెలిసి రాష్ట్ర నాయకుల సూచనలతో అధికార దుర్వినియోగానికి తెగబడుతోందని ఆరోపించారు.
అధికారులను బీజేపీ బదిలీ చేసినా ప్రజలు తృణమూల్ కాంగ్రెస్, దీదీ (మమతా బెనర్జీ) వెంట ఉంటారన్న విశ్వాసం తమకుందని అన్నారు. బీజేపీని టీఎంసీ మట్టికరిపిస్తుందని కునాల్ ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. సందేశ్ఖాలిలో బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యంపై బీజేపీ, ఇతర విపక్షాలు బెంగాల్ పోలీసులను లక్ష్యం చేసుకోగా ఈ ఘటనకు సంబంధించి డీజీపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ ఆయన అనుచరుల ఆగడాలపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం కోరడంతో సందేశ్ఖాలి ప్రాంతంలో అలజడి నెలకొంది. ఇక డీజీపీతో పాటు బృహన్ ముంబై మున్నిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ చహల్, పలు రాష్ట్రాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులను కూడా ఈసీ తొలగించింది.
Read More :
Shivaraj Singh | సోనియాకు లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం లేదా..?: శివరాజ్సింగ్ చౌహాన్