కోల్కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ను అధికార టీఎంసీ పార్టీ తీసుకువచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే తపన్ రాయ్ దీనిని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అనుమతి పొందకుండానే నారదా కుంభకోణం కేసులో సభ్యులపై సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ దర్యాప్తు సంస్థలు సభా హక్కుల ఉల్లంఘటనకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ను సభ ముందుకు తెచ్చారు.