న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు సంధించారని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. మహువా భారత్లో ఉండగా, ఆమె పార్లమెంటరీ ఐడీని మరొకరు దుబాయ్ నుంచి వినియోగించారని, ఈ విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్టు చెప్పారు.
ఎంపీలందరి లాగిన్ వివరాలు బహిర్గతం చేయాలి
బీజేపీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలపై మహువా తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ ఐడీ ద్వారా లాగిన్ అయిన ఎంపీలందరి వివరాలను ఎన్ఐసీ విడుదల చేయాలని, అలాగే వారంతా ఆయా ప్రదేశాలలో భౌతికంగా ఉన్నారా లేదా అన్నది పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ చేసిన బొగ్గు దిగుమతులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.