Bengal Governor | పశ్చిమ బెంగాల్ గవర్నర్ (Bengal Governor) సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose)పై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా గవర్నర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఇందులో భాగంగానే కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తన ఛాతీపై బీజేపీ పార్టీ గుర్తుతో కనిపించారని ఫిర్యాదులో పేర్కొంది.
‘పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవిని సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కోల్కతాలోని రామ్ టెంపుల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తన ఛాతీపై బీజేపీ లోగోను ధరించి కనిపించారు’ అని తృణమూల్ పార్టీ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది.
Also Read..
Diarrhoea | అస్సోంలో అతిసార వ్యాధితో 11 మంది మృతి.. ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
Gold Seized | ముంబై విమానాశ్రయంలో 11 కిలోల బంగారం స్వాధీనం
Anushka Sharma | ఆర్సీబీ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క శర్మ.. VIDEO