కోల్కతా: పశ్చిమ బెంగాల్లో వింత పరిస్థితి నెలకొన్నది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వరుసగా మూడోసారి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆధిక్యాల పరంగా ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. మెల్లగా బీజేపీ కంటే తమ ఆధిక్యాన్ని పెంచుకుంటోంది. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్ స్థానంలో వెనుకంజలో ఉండటం గమనార్హం. నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి నందిగ్రామ్లో మమతపై 8106 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారం ఉన్నారు. తొలి రౌండ్ నుంచే ఇక్కడ సువేందు హవా నడుస్తోంది.