CM Mamata benerjee | శంషేర్గంజ్ (పశ్చిమ బెంగాల్), మే 5: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పడటానికి కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు ఎంతమాత్రం ఉపయోగపడవని అన్నారు.
‘2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ ఏకం కావాలి.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నేను కోరుతున్నాను. విపక్ష పార్టీలను వేధించడానికి కేంద్రం సీబీఐ, ఈడీలను ప్రయోగించింది. కాని బీజేపీకి ఓట్లు తెచ్చిపెట్టడంలో అవి ఉపయోగపడవు. అవి ప్రజల నుంచి ఓట్లను తేలేవు’ అని మమతా బెనర్జీ అన్నారు.