బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా నాశనం చేశారని బాలీగంజ్ ఉప ఎన్నికల్లో ముందంజలో వున్న తృణమూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో అన్నారు. బాలీగంజ్ ప్రజలు సరైన తీర్పునే ఇచ్చారని పేర్కొన్నారు. తన సొంత బలంతోనే ఈ నియోజకవర్గంలో గెలుపొందానని, బీజేపీ అహంకారాన్ని దెబ్బతీశారని అన్నారు.
అయితే ఈ ఘన విజయం సీఎం మమతకు అంకితం చేస్తున్నానని బాబుల్ సుప్రియో ప్రకటించారు. రాష్ట్రంలో సీపీఎం అధికారంలో వున్న సమయంలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రచారంలో కూడా వారెక్కడో ఉండిపోయారని ఎద్దేవా చేశారు. శత్రుఘ్న సిన్హా కూడా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారని, ఆయనతో కలిసి పనిచేస్తానని బాబుల్ ప్రకటించారు.