న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్కు చెందిన మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ మూడవ రోజు కూడా రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.35 నిమిషాలకు ఆయన కార్యాలయానికి వచ్చారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఆందోళనకారుల్ని తరిమికొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇవాళ ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు నిరసనకారులు టైర్లకు నిప్పుపెట్టారు. ఇక ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్, కేసీ వేణుగోపాల్తో పాటు మరికొంత మంది నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పోలీసులు గుండాయిజం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. భారత దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత అరాచకాన్ని చూడలేదన్నారు.