Vande Bharat | తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ( Vande Bharat Express train)లో బుధవారం సాయంత్రం పొగలు (Smokes) వచ్చాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ (Tirupati-Secunderabad) వెళ్తోన్న వందేభారత్ రైలు నెల్లూరు (Nellore) జిల్లా మనుబోలు (Manubolu) రైల్వే స్టేషన్ వద్దకు రాగానే పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రైలును స్టేషన్ లో ఆపేశారు. రైలులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి కిందకు దిగేశారు.
రైలులోని మూడో బోగీలోని బాత్రూమ్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన అధికారులు అక్కడి కెళ్లి
పరిశీలించారు. కాల్చిపడేసిన సిగరెట్ (cigarette) ముక్క అక్కడున్న సామగ్రికి అంటుకోవడంతో పొగలు
వచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు టికెట్ లేకుండా రైలులో ప్రయాణించి వ్యక్తి కారణమని గుర్తించారు.
సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. గంట తర్వాత రైలు తిరిగి అక్కడి నుంచి బయలు దేరి
సికింద్రాబాద్ వెళ్లిపోయింది.
Also Read..
Crime news | మహిళను రూ.70వేలకు కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ప్రవర్తన నచ్చక చంపేశాడు