Naxal attack: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. మంగళవారం బీజాపూర్-సుక్మా సరిహద్దులో భద్రతాసిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు భద్రతాసిబ్బంది మృతిచెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన భద్రతాసిబ్బందని మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్లలో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు.
మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు బీజపూర్-సుక్మా సరిహద్దులోని టేకల్గూడెం గ్రామంలో ఇవాళ సెక్యూరిటీ క్యాంప్ను ఏర్పాటు చేశారు. అనంతరం భద్రతాసిబ్బంది.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సెక్యూరిటీ క్యాంప్పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.