Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్పాత్ (footpath)పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు (truck) దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్క్ (Shastri Park) సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఫుట్పాత్పై 5 మంది నిద్రిస్తున్నారు. ఓ ట్రక్కు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటన అనంతరం డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Delhi | This morning, three people died after a truck ran over a footpath in the Shastri Park area where 5 people were sleeping. The driver fled from the spot, leaving the vehicle behind. Further investigation underway: Delhi Police pic.twitter.com/aXqJvpBB3C
— ANI (@ANI) August 26, 2024
Also Read..
Dhaka | బంగ్లాదేశ్లో మరోసారి చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు
Pakistan: బస్సుల్లోంచి ప్రయాణికుల్ని దించి.. పాకిస్థాన్లో 23 మందిని కాల్చేశారు
Vinesh Phogat: గోల్డ్ మెడల్తో వినేశ్ ఫోగట్ను సత్కరించిన కాప్ పంచాయతీ