శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని చంద్గామ్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా టెర్రరిస్టులు, గాలింపు బృందాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధ సామగ్రి, 2ఎం-4 కార్బైన్లు, ఏకే రైఫిల్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.