కోల్కతా/ఇండోర్: కరోనా (corona) మహమ్మారి సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆయా ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేశాయి. తాజాగా బంగ్లాదేశ్, నైజీరియా నుంచి భారత్కు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు వారిని దవాఖానకు తరలించారు. ఒమిక్రాన్ వైరస్ను నిర్ధారించడానికి వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించారు.
నైజీరియా నుంచి ఇద్దరు చిన్నారులు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వచ్చారు. విమానాశ్రయంలో వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని ఎన్సీడీసీకి పంపించారు. వారిని దవాఖానకు తరలించామని ఇండోర్ కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ మలాకర్ చెప్పారు.
ఇక పశ్చిమబెంగాల్లోని బరాసత్కు చెందిన ఓ వ్యక్తి బంగ్లాదేశ్కు వెళ్లివచ్చాడు. అతడిని పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అది ఒమిక్రానా కాదా అనే విషయాలను తెలుసుకోవాడాని అతని నమూనాలను పరీక్షలకు పంపించారు. అతనికి బెలఘతాలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.