భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో మూడు చీతా కూనలు సందడి చేస్తున్నాయి. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల చీతా ఈ నెల 20న వీటికి జన్మనిచ్చింది. ‘కునోలో కొత్త కూనలు! జ్వాల మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
వన్యప్రాణి సంరక్షకులకు, ప్రేమికులకు శుభాకాంక్షలు’ అని మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. 10 నెలల విరామం తర్వాత జ్వాల రెండోసారి పిల్లలను ఈనింది. గతంలో ఈనిన నాలుగు పిల్లల్లో ఒకటి మాత్రమే బతికింది.