కొత్తగూడెం క్రైం, హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు. కాల్పుల్లో ఓ ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.