న్యూఢిల్లీ: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జరిపిన వాళ్లు కాగా, మరో వ్యక్తి ఈ హత్య కోసం నిందితులకు సహకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని తాము అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు చెందిన స్పెషల్ పోలీస్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు.
కేసు నమోదైనప్పటి నుంచి నిందితులను నిరంతరాయంగా ట్రాక్ చేశామని, చివరికి చండీగఢ్లో వాళ్లు పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత నిందితులు ముగ్గురిని రాజస్థాన్ పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. కాగా, కొద్దిసేపటి క్రితం నిందితులను పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి బయటికి తీసుకెళ్లిన దృశ్యాలు నేషనల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
కాగా, ఈ నెల 5న జైపూర్లోని తన నివాసంలో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైకు మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు సుఖ్దేవ్ సింగ్తో మాట్లాడుతున్నట్టుగా నటించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కుటుంబసభ్యులు సుఖ్దేవ్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
#WATCH | Delhi: Accused in the Sukhdev Singh Gogamedi murder case being taken away from the Crime Branch Office.
(Visuals from the Crime Branch Office) pic.twitter.com/DUKssjg2dr
— ANI (@ANI) December 10, 2023