లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలో ఉన్న వ్యక్తుల పనిని చూశామని, లఖింపూర్లో వాహనాలతో రైతులను తొక్కించిన వారి చర్యను చూశామని విమర్శించారు. చట్టాన్ని కూడా అణగతొక్కే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. రైతులు, చట్టాన్ని ధ్వంసం చేయగల వారు రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కగలరని మండిపడ్డారు.
అన్నదాతలైన రైతులు ఇవాళ అనేక అవమానాలను ఎదుర్కోవలసి వస్తున్నదని అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ‘మావలి’ అని పిలుస్తారని, అయితే వారు (బీజేపీ) అన్నదాతలను ఉగ్రవాదులుగా పిలుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అనేక సార్లు అవమానించినప్పటికీ రైతులు తమ ఆందోళన నుండి వైదొలగలేదని, దీనికి తాను వారిని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.