కోల్కతా: ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఓ ముస్లిం వ్యక్తి మోదీ చెవిలో ఏదో చెబుతున్న ఫొటో అది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు అతడు మోదీకి ఏం చెప్పి ఉంటాడన్న చర్చ కూడా జరిగింది. దీనిపై వందల, వేల సంఖ్యలో మేమ్స్ కూడా సోషల్ మీడియాను ముంచెత్తాయి. చివరికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఫొటోపై స్పందించారు. తనను కూడా ఆ ముస్లిం వ్యక్తి మోదీకి ఏం చెప్పి ఉంటాడని అని కొందరు అడిగారని, తాను బంగ్లాదేశ్ వాసిని కాదు అని అతడు చెప్పి ఉండొచ్చని తాను సమాధానమిచ్చినట్లు ఒవైసీ ఓ సభలో చెప్పారు.
అయితే ఆ వ్యక్తి పేరు జుల్ఫికర్ అలీ కాగా.. తాను మోదీ చెవిలో ఏం చెప్పానో ఇప్పుడా వ్యక్తే వెల్లడించాడు. ఇంతకీ అతడు ఏం అడిగాడో తెలుసా? మీతో ఓ ఫొటో దిగాలని ఉన్నదని మోదీతో అన్నాడట. ఈ విషయాన్ని జుల్ఫికర్ అలీ ఇండియా టుడే టీవీతో చెప్పాడు. సోనార్పూర్ సభలో మోదీని అతడు కలిశాడు. ఆ వ్యక్తిని నేనే. నేను చాలా కాలంగా బీజేపీలోనే ఉన్నాను. కానీ ప్రధానిని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన రాగానే నేను నమస్కరించాను. ఆయన కూడా ప్రతి నమస్కారం చేశారు అని జుల్పికర్ చెప్పాడు.
తనను మోదీ పేరు పెట్టి మరీ పలకరించారని, ఏదైనా కావాలా అని అడిగారని జుల్ఫికర్ తెలిపాడు. నాకు ఎమ్మెల్యే టికెటో, కౌన్సిలర్ టికెటో వద్దు. మీతో ఒక్క ఫొటో దిగితే చాలు అని అన్నాను. ఆ వెంటనే ఆయన నాతో ఫొటోలు దిగారు అని జుల్ఫికర్ చెప్పాడు. 40 సెకన్ల పాటు అతడు మోదీతో మాట్లాడటం విశేషం. దక్షిణ కోల్కతా జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా జుల్ఫికర్ పని చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ప్రభుత్వంతో జే&జే చర్చలు
మా రోమియోలంటే మాకిష్టం.. యోగికి టీఎంసీ ఎంపీ కౌంటర్
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి స్పెషల్ గెస్ట్లు.. ఎవరో తెలుసా?
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!