కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియ. ఈ ఓటమి తర్వాత తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు దీదీకే పట్టం కట్టారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం. సంస్థాగత సమస్యలా, లేక ఇన్సైడర్, ఔట్సైడర్ చర్చ వల్లా అన్నది చూడాలి. తప్పు ఎక్కడ జరిగిందో మేము చూస్తాం అని ఆయన స్పష్టం చేశారు.