ముంబై : దేశ ఆర్థిక రాజదాని ముంబైలో (Mumbai Covid) మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల వారం రోజుల్లో 18 శాతం అధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చిందని ముంబై మేయర్ కిషోర్ పెడ్నేకర్ మంగళవారం ప్రకటించారు. దీంతో ముంబైవాసులు మరోసారి కంటిమీద కునుకు కరువై బిక్కుబిక్కుమంటున్నారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు నాగ్పూర్లో వ్యాపారాల సమయాల్లో మార్పులు చేశారు.
ఎల్లుండి నుంచి మొదలుకానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా ముంబైకి మరోసారి కరోనా ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్నది. సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో మొత్తం కరోనా కేసులలో దాదాపు 18 శాతం పెరుగుదల కనిపించింది. గత వారంలో 2,939 కొత్త కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఆగస్టు 1-7 మధ్య ముంబైలో 2,413 కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. రానున్న 15 రోజులు చాలా ముఖ్యమైనవని బృహన్ ముంబై కమిషన్ (బీఎంసీ) హెచ్చరించింది. గణేష్ ఉత్సవ సమయంలో భక్తులు గణేష్ పండాలను సందర్శించకుండా బీఎంసీ నిషేధించింది. నాగ్పూర్లో కరోనా ప్రమాదం నిరంతరం పెరుగుతుండటంతో.. ఇక్కడ కూడా దుకాణాలు తెరిచే సమయం మార్చారు. సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచనున్నారు.
ముంబైలో మంగళవారం 349 కరోనా కేసులు నమోదుకాగా.. ఐదుగురు రోగులు మరణించారు. దీంతో ముంబైలో కరోనా రోగుల సంఖ్య 7,46,725 కు, మరణాల సంఖ్య 15,998 కు చేరుకున్నది. గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 1 నుంచి ప్రతిరోజూ 400 మందికి పైగా కరోనా రోగులు వస్తున్నారు. పుణె నగరంలో 238 కొత్త కేసులు.. రెండు మరణాలు నమోదయ్యాయి.
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్కు 55 ఏండ్లు
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..